ఆదిలాబాద్ లైబ్రరీ ఎదుట అభ్యర్థుల ఆందోళన
NEWS Jan 18,2025 06:08 am
ఆదిలాబాద్ టౌన్లైబ్రరీ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గ్రంధాలయాన్ని మూసి వేశారని నిరుద్యోగ అభ్యర్థులు ఆరోపించారు. లైబ్రరికి వచ్చిన పోటీ పరీక్షల అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు మాట్లాడుతూ… గతంలో లైబ్రరీని సందర్శించిన కలెక్టర్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారన్నారు.