ఎన్టీఆర్ ఎలా చనిపోయారో అందరికీ తెలుసు
NEWS Jan 18,2025 04:52 am
వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన భర్త , దివంగత ఎన్టీఆర్ ఎలా చని పోయారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఎన్టీఆర్ వర్దంతి సందర్బంగా ఆయనకు నివాళులు అర్పించారు. గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నానని, ఇప్పటికీ ఆ దుర్మార్గుల అరాచకాలు తనను వెంటాడుతూనే ఉన్నాయని వాపోయారు. జనం సాక్షిగా పెళ్లి చేసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.