దుర్గమ్మ భక్తులకు నారా లోకేష్ సారీ
NEWS Jan 18,2025 03:49 am
విజయవాడ కనక దుర్గమ్మ గుడి ప్రాంగణంలోని ప్రసాదం కౌంటర్ వద్ద నెలకొన్న మంచినీటి సమస్యపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జరిగిన అసౌకర్యానికి మన్నించాలని భక్తులను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.