జగన్ నిర్వాకం నిమ్మల ఆగ్రహం
NEWS Jan 18,2025 03:38 am
మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు తనకు లేదన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది చాలక తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తన మీడియాను అడ్డం పెట్టుకుని అసత్య ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాడంటూ మండిపడ్డారు. ప్రజలు జగన్ ను క్షమించరని అన్నారు.