ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
NEWS Jan 18,2025 03:04 am
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. ఫిబ్రవరి 13 వరకు లోక్ సభ, రాజ్యసభ సమావేశాలు కొనసాగుతాయని వెల్లడించారు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి.