బీజేపీ మేనిఫెస్టో విడుదల
NEWS Jan 17,2025 11:39 am
ఢిల్లీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇవాళ్టితో నామినేషన్ల పర్వం ముగిసింది. ఎన్నికల సందర్బంగా బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా. మహిళా సమృద్ది యోజన పేరుతో మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 , పేద మహిళలకు సిలిండర్ పై రూ. 500 సబ్సిడీ, హొళీ, దీపావలి పండుగలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్, గర్భిణీలుకు రూ. 21,000 ఇస్తామని హామీల వర్షం కురిపించింది.