దివిసీమను ఎన్నటికి మరచి పోలేనని, తన సేవా జీవితానికి నాంది పలికింది ఇక్కడేనని అన్నారు హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఎమ్మెల్యే బుద్ద ప్రసాద్ గవర్నర్ ను కలిశారు. నాటి ఉప్పెనలో మండలి వెంకట కృష్ణారావు చేసిన సేవ చారిత్రాత్మకమని పేర్కొన్నారు దత్తన్న. ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా భాషాభివృద్దికి చేసిన కృషి అభినందనీయమన్నారు. తన ఆత్మకథలో దివిసీమ గురించి రాస్తానన్నారు.