ఈరవత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
NEWS Jan 15,2025 05:22 pm
రైతుల పంటలే ప్రమాణికమని ఆర్మూర్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి అన్నారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామంలో ఈరవత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకు దంపతులు ఈరవత్రి రాజశేఖర్-సునీత ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినానికి మహిళామణుల రకరకాల రంగవల్లులతో అందంగా ముగ్గులతో తీర్చిదిద్దారు. ముఖ్య అతిథిగా ఆర్మూర్ కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల,అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సరళరాణి హాజరయ్యారు. ముగ్గుల పోటీలో హాజరైన 90 మంది పాల్గొన్నారు.