స్మృతి మంధాన..ప్రతీకా రావల్ వరల్డ్ రికార్డ్
NEWS Jan 15,2025 11:15 am
భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఐర్లాండ్ తో జరిగిన కీలక వన్డే మ్యాచ్ లో ఏకంగా 436 పరుగులు చేసింది. స్టార్ క్రికెటర్లు స్మృతీ మంధాన ఫాస్టెస్ట్ సెంచరీతో దుమ్ము రేపితే ప్రతీకా రావల్ సెన్సేషన్ ఇన్నింగ్స్ ఆడింది. మంధాన 135 రన్స్ చేస్తే , ప్రతీకా 154 పరుగులు చేసింది. 70 బంతుల్లో 12 ఫోర్లు 7 సిక్సర్లతో స్మృతీ రెచ్చి పోతే ప్రతీకా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు ఓ సిక్సర్ తో మెయిడన్ సెంచరీ చేసింది.