ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు
NEWS Jan 15,2025 10:54 am
రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు కొత్త ఏడాదిలో నిర్వహించే పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఏప్రిల్ 29, 30న ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ, మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్ ఇంజినీరింగ్, మే 12న ఈసెట్, జూన్ 1న ఎడ్సెట్ పరీక్ష, జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్, 8,9 తేదీల్లో ఐసెట్ , జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు చేపడతామని పేర్కొంది. హాజరయ్యే విద్యార్థులు ఆయా తేదీలకు అనుగుణంగా ప్రిపేర్ కావాలని సూచించింది సర్కార్.