వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
NEWS Jan 15,2025 09:44 am
గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయనుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రభుత్వం అమలులోకి తెస్తోందని అన్నారు. అర్హులైన కుటుంబాలకు రెండు విడతలలో రూ.6 వేలు చొప్పున ప్రతీ సంవత్సరం రూ.12,000 నేరుగా వారి ఖాతాలలో జమ చేస్తారన్నారు.