పసుపు బోర్డు సాధిస్తాననే ధైర్యంతోనే బాండ్ పేపర్
NEWS Jan 15,2025 09:44 am
పసుపు బోర్డుసాధిస్తాననే ధైర్యంతోనే బాండ్ పేపర్ రాసిచ్చానని తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు .పట్టు వదలకుండా కేంద్రం చుట్టూ తిరిగి దీన్ని సాధించగలిగానన్నారు. పసుపు బోర్డు సాధనతో నాకు ఎంతో సంతృప్తి కల్గిందని, బోర్డుతో పసుపు రైతుల జీవితాల్లో మార్పులు కనిపిస్తాయన్నారు. బోర్డు తీసుకొచ్చామని చెప్పే బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలవి చిల్లర మాటలన్నారు. తదుపరి టార్గెట్ నిజామాబాద్లో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయడమే అని పేర్కొన్నారు.