కథలాపూర్ లో కేపీఎల్ టోర్నమెంట్
NEWS Jan 15,2025 06:11 am
కథలాపూర్ మండల కేంద్రంలో సంక్రాంతి సందర్భంగా కథలాపూర్ కేపీఎల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో భాగంగా మొదటి బహుమతి మనోజ్ టీంకు అందజేశారు. రెండో బహుమతి పరమేశ్వర్ టీంకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు న్యావనంది శేఖర్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకులు క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడల పట్ల ఆసక్తి చూపినట్లయితే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. కథలాపూర్ క్రీడాకారుల కోసం క్రీడా మైదానంను ఇప్పిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగరి శ్రీకాంత్, సాయి ప్రసాద్, రషీద్, ప్రసాద్, శ్రీనాథ్ పాల్గొన్నారు.