కేరళ, తమిళనాడుకు కల్లక్కడల్ ముప్పు ఉండడంతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.. తీరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. దీంతో ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర వాతావరణ శాఖ. కేరళ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగింది. తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచింది. మరో వైపు తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరారు.