సౌతాఫ్రికాలో విషాదం 100 కార్మికులు దుర్మరణం
NEWS Jan 15,2025 05:23 am
దక్షిణాఫ్రికాలో పెను విషాదం చోటు చేసుకుంది. బంగారు గనిలో చిక్కుకుని సుమారు 100 మంది కార్మికులు మృతి చెందారు. నెలల తరబడి అక్రమంగా బంగారం మైనింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఆకలి,డీహైడ్రేషన్ కారణంగా కార్మికులు చనిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం పలువురిని రక్షించారు. మరికొందరు క్షతగాత్రులుగా మారారు. వారిని ఆస్పత్రికి తరలించారు.