బీజేపీ మండల అధ్యక్షుడికి సన్మానం
NEWS Jan 14,2025 04:30 pm
మల్యాల మండల బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన గాజుల మల్లేశంను పట్టణ హనుమాన్ వీధి యువ చైతన్య యూత్ సభ్యులు మంగళవారం సన్మానించి, అభినందించారు. అనంతరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాటిపాముల రాంప్రసాద్, పోతుగంటి భీమయ్య, కొక్కు నాగయ్య, ఎనుగందుల ప్రభాకర్, మామిడాల రాజు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.