ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం
NEWS Jan 14,2025 09:13 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట ఇచ్చారంటే ఎన్నడూ వెనక్కి తగ్గరని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ . నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని పాలమూరులో జరిగిన సభలో ప్రకటించారని, ఆ మేరకు నెరవేర్చారని స్పష్టం చేశారు. పసుపు బోర్డుకు సహకరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇక పసుపు పండించే రైతులకు ఎలాంటి ఇబ్బందులంటూ ఉండవన్నారు.