మోదీ..ఎంపీ చిత్రపటాలకు పాలాభిషేకం
NEWS Jan 14,2025 06:39 am
మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ ధర్మపురి అర్వింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వారు ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు కొమ్ముల రాజుపాల్ రెడ్డి, నాయకులు భోగ గంగాధర్, శ్రీనివాస్, శివారెడ్డి, ప్రశాంత్, భూమేశ్వర్, మోహన్, జలంధర్ తదితరులు పాల్గొన్నారు.