ఏపీలో రూ. 8 వేల కోట్ల బకాయిల చెల్లింపు
NEWS Jan 14,2025 06:33 am
ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెండింగ్ లో ఉన్న బకాయిలను క్లియర్ చేసింది. వివిధ ఉద్యోగులు, పోలీసులు, చిన్న కాంట్రాక్టర్లకు ఊరటనిచ్చేలా పెండింగ్ నిధులు విడుదల చేశారు. 26 వేల మంది చిన్న కాంట్రాక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క జనవరి నెలలోనే ఏకంగా రూ. 8 వేల కోట్లు చెల్లించింది ప్రభుత్వం. పోలవరం నిర్వాసితులకు రూ. 1000 కోట్లు, ఉద్యోగులకు చెల్లింపుల కింద రూ. 1300 కోట్లు, ఫీజు రీ-ఇంబర్సుమెంట్ బిల్లు రూ. 788 కోట్లు చెల్లించింది.