పట్టు వదలని విక్రమార్కుడు ఎంపీ అర్వింద్
NEWS Jan 14,2025 06:34 am
పసుపు బోర్డు సాధిస్తాననే హామీ, నినాదంతో ఇందూరు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఎంపీ ధర్మపురి అర్వింద్ పట్టువదలని విక్రమార్కుడిలా ఒక్కో అడుగు ముందుకేస్తూ లక్ష్యాన్ని సాధించారు. తెలంగాణలో పసుపు బోర్డుకు ప్రధాని మోదీతో ప్రకటన చేయించి ఇందూరులోనే ఏర్పాటు చేసేవరకు పట్టు వదలకుండా ముందుకెళ్లారు. 2024 ఏప్రిల్ 19న బోర్డ్ ప్రకటన చేశారు.