అహోబిలం దర్శన వేళల్లో మార్పులు
NEWS Jan 14,2025 06:28 am
పారవేట ఉత్సవం సందర్బంగా అహోబిలం దర్శన వేళల్లో కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించారు దేవస్థానం జనరల్ మేనేజర్ వి. మురళీధరన్. అహోబిలం మఠం 46వ పీఠాధిపతి సూచనల మేరకు ఈ కీలక మార్పులు చేసినట్లు తెలిపారు. దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఎగువ అహోబిలంలో సాయంకాలం 4 గంటల వరకు, దిగువ అహోబిలంలో మధ్యాహ్నం 3 గంటల వరకే దర్శనం ఉంటుందని స్పష్టం చేశారు.