శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు
NEWS Jan 13,2025 10:32 am
తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన, పటిష్టమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నామని టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు తెలిపారు. పాలకమండలి తీసుకునే నిర్ణయాలను అమలు చేయడంలో కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యం అవుతోందని, తొందరపడి అసత్య ప్రచారం చేయవద్దని విన్నవించారు. సంబంధిత వ్యక్తుల నుంచి వాస్తవ సమాచారాన్ని తెలుసుకుని వార్తలు రాయాలని సూచించారు.