వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
NEWS Jan 13,2025 09:08 am
గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయనుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రభుత్వం అమలులోకి తెస్తోందని అన్నారు.అర్హులైన కుటుంబాలకు రెండు విడతలలో రూ. 6 వేలు చొప్పున ప్రతీ సంవత్సరం రూ. 12,000 నేరుగా వారి ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.