మ్యాట్రీ మోనీ మోసాలతో జాగ్రత్త
NEWS Jan 13,2025 06:22 am
టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మ్యాట్రీ మోనీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు హెచ్చరించారు. యువతను అలర్ట్ చేశారు. మ్యాట్రీ మోనీ సైట్లలో అందమైన యువతీ యువకుల ఫోటలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు. పెళ్లి పేరుతో మోసం చేస్తున్నారని వాపోయారు. యువతీ, యువకులు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోసానికి గురైతే 1930 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.