జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
NEWS Jan 13,2025 09:10 am
డీచ్పల్లి మండలంలోని సుద్దపల్లిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాలకు చెందిన నేహశ్రీ జాతీయస్థాయి సీనియర్ సౌత్ జోన్ సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ నళిని తెలిపారు. ఈ నెల 5న మనోహరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సెలెక్షన్ టోర్నమెంట్లో విద్యార్థి చక్కని ప్రతిభ కనబర్చి, ఈ నెల13వ తేదిలో పాండిచ్చేరిలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు నేహశ్రీ ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.