సంక్రాంతి సంబురాల్లో ఎంపీ..ఎమ్మెల్యే
NEWS Jan 13,2025 03:52 am
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని టీడీపీకి చెందిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంబురాలలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పండుగ సంబురాలను ప్రారంభించారు. శాస్ట్రోక్తం గా పూజలు నిర్వహించిన అనంతరం భోగి మంటలు వెలిగించి తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ, ఎమ్మెల్యేలు. సంబురాలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.