కొండగట్టులో గోదాదేవి కళ్యాణం
NEWS Jan 12,2025 03:56 pm
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 13న గోదాదేవి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు గోదాదేవి ఉత్సవ మూర్తుల విగ్రహాలకు కళ్యాణ మహోత్సవం ప్రారంభించబడునని, అనంతరం గోదాదేవి తాను మోహించిన రంగనాయకుల కోసం రచించిన 30 పాశురంలలోని ఆఖరి పాశురం (పద్యం)తో నీరాజనం సమర్పిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.