భారత్ విజయం.. సిరీస్ కైవసం
NEWS Jan 12,2025 03:48 pm
ఐర్లాండ్ మహిళల టీమ్తో జరిగిన రెండో వన్డేలో భారత్ 116 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో వన్డే మిగిలి ఉండగానే స్మృతి మంధాన సేన 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలుత 370/5 స్కోర్ చేసిన టీమ్ ఇండియా ప్రత్యర్థిని 254/7 స్కోరుకే పరిమితం చేసింది. దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2, టిటాస్, సయాలి చెరో వికెట్ తీశారు. బ్యాటింగ్లో జెమీమా(102), హర్లీన్(89), స్మృతి(73), ప్రతికా రావల్(67) రాణించారు.