చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు
NEWS Jan 12,2025 03:35 pm
సంక్రాంతి పండగ సందర్భంగా పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగరవేసే విషయంలో కోరుట్ల నియోజకవర్గ ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని మెట్ పల్లి డీఎస్పీ రాములు సూచించారు. చైనా మాంజాను వాడకూడదని హెచ్చరించారు. మాంజా దారం వల్ల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనా మాంజా వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.