స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి
NEWS Jan 12,2025 03:42 pm
నిజామాబాద్ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా మండలాల నూతన అధ్యక్షులు పని చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి సూచించారు. ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్, మండలాల అధ్యక్షులతో ఎంపీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ బీజేపీ మరింత బలోపేతానికి తమవంతు కృషి చేయాలని సూచించారు. జెడ్పీ, కార్పొరేషన్, మున్సిపాలిటీలు, మండల పరిషత్లు, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతలను తీసుకోవాలన్నారు .