వాడపల్లిలో వైభవంగా అష్టోత్తర పూజలు
NEWS Jan 12,2025 11:28 am
కోనసీమ తిరుమలగా ప్రాచుర్యం పొందిన ఆత్రేయపురంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అష్టోత్తర పూజలు ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాలు, భక్తుల గోవింద నామ స్మరణల నడుమ ఈ పూజా కార్యక్రమం ఆద్యంతం ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో భక్త దంపతులు అష్టోత్తర పూజలో పాల్గొన్నారు. స్వామిని దర్శించుకుని ముడుపులు, మొక్కులు సమర్పించారు.