మల్యాలలో గ్రామీణ ఉపాధి హామీ పథక గ్రామసభ
NEWS Jan 11,2025 07:10 pm
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీలో భాగంగా శనివారం మల్యాల గ్రామపంచాయతీలో గ్రామ సభ నిర్వహించారు. సామాజిక తనిఖీలలో భాగంగా వారు గుర్తించిన పనుల రిపోర్టును డీఆర్పీ రాజు గ్రామసభలో చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో జీపీ అధికారి బాబు, ఈసీ మనోజ్, ఏపీవో శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్లు లావణ్య, జలపతి, కమిటీ సభ్యులు శనిగారపు తిరుపతి, విఎస్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్ సుజాత, ఉపాధి హామీ కూలీలు, తదితరులు పాల్గొన్నారు.