క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సీఐ, ఎస్ఐ
NEWS Jan 11,2025 07:10 pm
మల్యాల మండల కేంద్రంలోని క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటుచేసిన వడ్డేపల్లి అనురాధ స్మారక క్రికెట్ టోర్నమెంట్ MMPL సీజన్-2 ను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సీఐ నీలం రవి, ఎస్సై నరేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు శశాంక్ ఆధ్వర్యంలో ఫ్రాంచైజీలు, ప్లేయర్స్, యువకులు స్థానిక అంగడి బజారు నుండి క్రాస్ రోడ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆదిరెడ్డి, సుదర్శన్, ప్రసాద్, తిరుపతి రెడ్డి, వంశీ, మల్లేశం, సురేష్, పృథ్వీరాజ్, రమణారెడ్డి పాల్గొన్నారు.