క్యాలెండర్ ఆవిష్కరించిన సీఐ నిరంజన్రెడ్డి
NEWS Jan 11,2025 05:48 pm
కథలాపూర్ మండలంలోని కలదార పబ్లిక్ స్కూల్లో మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి 2025 నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రతి ఒక్కరు ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉండాలని కోరారు. యువత క్రీడల వైపు మొగ్గుచూపులని, విద్యార్థులు నిత్యం పాఠశాలలో ఉండే విధంగా ప్రయత్నించాలని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు సూచించారు. ఇటీవల యువత చెడు అలవాట్లకు తొందరగా బానిసవుతున్నారని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.