రెండు బైకులు ఢీ. ఒకరి మృతి
NEWS Jan 11,2025 05:04 pm
కథలాపూర్ మండలంలోని తండ్రియాల గ్రామంలో రెండు బైకులు ఢీ కొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. కథలాపూర్ ఇన్చార్జ్ ఎస్సై రామచంద్రం గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం కోరుట్ల నుండి రాజలింగంపేటకు వెళ్తున్న గుగ్గిల గంగరాజం 52 వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించారు. రుద్రంగి నుండి కోరుట్లకి వెళ్తున్న బైకు రెండు డి కొనడం వల్ల గంగరాజం మృతి చెందాడని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.