రాష్ట్ర ప్రాంతీయ రవాణా అథారిటీ సభ్యులుగా నరేందర్ గౌడ్
NEWS Jan 13,2025 11:40 am
సుదీర్ఘ కాలంగా పార్టీ తరపున కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిన నిజామాబాద్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ రవాణా అథారిటీ సభ్యులుగా నియామించారు.రాష్ట్ర ప్రాంతీయ రవాణా అథారిటీ సభ్యులుగా నియమించినందుకు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీలకు కృతజ్ఞతలు తెలిపారు.