461 గ్రాముల గంజాయి స్వాధినం
NEWS Jan 11,2025 05:43 am
నిజామాబాద్లోని 4వ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ఇంటిపై దాడి చేసి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ సీఐ శ్రీనివాసరాజు తెలిపారు. శ్రీకాంత్ తన బృందంతో కలిసి వినాయకనగర్లోని ఓ ఇంటిపై దాడి చేయగా 461 గ్రాముల గంజాయి పట్టుబడిందన్నారు. నలుగురు యువకులు ఆకాశ్, రోహిత్కుమార్, శివరాణా రామతేజ్ రెడ్డి, రాకేశ్తోపాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారన్నారు.గంజాయితోపాటు 5 సెల్ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లు, ఓ కారు, గంజాయి ప్యాకింగ్కు ఉపయోగించే 18 ఖాళీ ప్లాస్టిక్ కవర్స్ను స్వాధీనం చేసుకున్నారు.