రెండు బైకులు ఢీ ముగ్గురు మృతి
NEWS Jan 10,2025 07:29 pm
తక్కలపల్లి అనంతరం మధ్య రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్కు చెందిన అరవింద్, బత్తుల సాయి అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు వంశీని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. వారం క్రితం వంశీ గల్ఫ్ నుండి వచ్చి తిరుపతి వెళ్లి వచ్చాడు. తిరుపతి ప్రసాదం ఇచ్చి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.