మార్కాజి ఇంతేజమి కమిటీ మిల్లతే ఇస్లామియా అధ్యక్షునిగా అక్తర్ జానీ
NEWS Jan 10,2025 03:40 pm
మెట్ పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ మిల్లతే ఇస్లామియా అధ్యక్షునిగా అక్తర్ జానీ 583 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యారు. ఎన్నికల్లో అధ్యక్ష పదవికి, నలుగురు అభ్యర్థులు బరిలో ఉండగా, అక్తర్ జానీ మొదటి స్థానంలో నిలిచారు మొత్తం16 మస్జిదులలో 20 పోలింగ్ బూతులు నిర్వహించారు. 1892 ఓటు నమోదు అయ్యాయి. బిస్మిల్లా మసీదులో కౌంటింగ్ చేయగా 4 గ్రౌండ్లలో ముందంజగా ఉండి. అక్తార్ జానీ 2 ఏళ్ల పాటు అధ్యక్షునిగా ఉంటారని ఎలక్షన్ కమిషనర్ తెలిపారు.