స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు
NEWS Jan 10,2025 01:19 pm
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్ లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాల వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు, రంగు రంగుల, వల్లికలతో గొబ్బమ్మ లతో ముగ్గుల వేశారు. ప్రిన్సిపల్ విజయ్ కుమారి మాట్లాడుతూ.. విద్యార్థులకు సంక్రాంతి అంటే సెలవులే కాదని, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు ముగ్గుల పోటీలు నిర్వహించామన్నారు. పాఠశాల కరస్పాండెంట్ దొంతుల రాజకుమార్, మేనేజ్మెంట్ సిహెచ్ రాజేశ్వర్ గౌడ్, ఉపాధ్యాయులు, అరుణ్ దీప్ గౌడ్, వెంకటకృష్ణ, మనోజ్ కుమార్ పాల్గొన్నారు.