తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే
NEWS Jan 10,2025 09:35 am
వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త దర్శించారు. తెలుగు ప్రజలందరు భక్తి, శ్రద్దలతో పవిత్రంగా వైకుంఠ ఏకాదశి పండుగను జరుపుకుంటారని అన్నారు, మహావిష్ణుమూర్తి స్వయంగా గరుడ వాహనదారుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకనికి వచ్చి దర్శనం ఇస్తాడని ప్రజల నమ్మకం అన్నారు.