అమిత్ షా రాజీనామా చేయాలి
NEWS Jan 10,2025 07:01 am
జై బాపూజీ, జై భీం,జై సంవిధాన్ పోస్టర్ ను ఆవిష్కరించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పుకోక పోతే బర్తరఫ్ చేయాలన్నారు. రాజ్యాంగం పట్ల ఏనాడూ బీజేపీ గౌరవించిన దాఖలాలు లేవన్నారు. 143 కోట్ల మంది భారతీయుల ఆత్మ గౌరవం రాజ్యాంగమన్నారు. తాడిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని పేర్కొన్నారు.