యాదగిరిగుట్టలో ఘనంగా ఏకాదశి వేడుకలు
NEWS Jan 10,2025 05:52 am
ముక్కోటి ఏకాదశి సందర్బంగా తెలంగాణలోని దేవాలయాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఉదయం 5:15 నిమిషాలకు గరుడ వాహనంపై ఉత్తరద్వార దర్శనం ఇచ్చారు యాదగిరీశుడు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షపుష్పార్చన, ఆర్జిత సేవలు రద్దు చేసింది పాలక మండలి. ఈనెల 15 వరకు అధ్యయనోత్సవాలు జరుగుతాయని తెలిపింది.