తప్పంతా టీటీడీ ఈవో..ఏఈవోలదే
NEWS Jan 10,2025 03:30 am
తిరుపతిలో టోకెన్ల జారీకి సంబంధించిన తొక్కిసలాట ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధితులను పరామర్శించారు. ఈ సంఘటనకు పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఈవో శ్యామల రావు, ఏఈవో వెంకయ్య చౌదరి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కొందరు పోలీసులు చూస్తూ ఉండి పోయారని తనకు భక్తులు ఫిర్యాదు చేశారన్నారు. ఇలాగేనా వ్యవహరించేది అంటూ మండిపడ్డారు.