ఏపీ సీఎం సంచలన నిర్ణయం
NEWS Jan 10,2025 03:17 am
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు ఎస్పీ సుబ్బా రాయుడు, జేఈవో గౌతమ్ సహా మరో అధికారిపై బదిలీ వేటు వేశారు. ఘటనకు సంబంధించి జ్యూడీషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్లు స్పష్టం చేశారు సీఎం.