జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో కాంస్యం
NEWS Jan 10,2025 09:57 am
మహారాష్ట్రలో ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ జాతీయస్థాయి సాప్ట్బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. జట్టులోని జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. అండర్-17 విభాగంలో తృతీయ స్థానం కోసం హర్యానా జట్టుతో తలపడిన రాష్ట్ర జట్టు 03-05 తేడాతో విజయం సాధించింది. అనంతరం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా ట్రోఫీ, పతకాలు అందుకున్నారు.