చైనా మాంజపై అవగాహన కల్పించండి
NEWS Jan 09,2025 02:25 pm
చైనా మాంజాతో జరిగే నష్టాలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరుతూ మెట్ పల్లి ఆర్డిఓ శ్రీనివాస్ కు, ఎంఈఓ చంద్రశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో చైనా మాంజా వలన గత సంవత్సరం జరిగిన కొన్ని సంఘటనల్లో ప్రాణ నష్టం జరిగిందని దీనిని దృష్టిలో పెట్టుకొని అవగాహన కల్పించి మాంజా వినియోగించకుండా చూడాలన్నారు. గోరు మంతుల సురేందర్, శ్రీనివాస్, సదానందం, జగన్, రమేష్ తదితరులున్నారు.