పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు
NEWS Jan 09,2025 02:25 pm
మల్యాల మండల కేంద్రంలోని ఒడ్డెర కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి అంటే 3 రోజులు జరుపుకునే భోగి, సంక్రాంతి, కనుమ పండుగలని, వీటి గురించి విద్యార్థులు చాలా చక్కగా వివరించారు. హరిదాసు వేషధారణ ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులు పతంగులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుల శంకర్, ఉపాధ్యాయులు విట్టల్, సుహాసిని, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.