కోతుల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
NEWS Jan 09,2025 02:24 pm
కోతులు మూకుమ్మడి దాడి చేసి మహిళను తీవ్రంగా గాయపరిచిన ఘటన మల్యాల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మల్యాల కేంద్రంలో నివసిస్తున్న అమృతమ్మ అనే మహిళ ఇంట్లోకి చొరబడ్డ కోతులు ఇంట్లో ఉన్న వస్తువులను చిందర వందర చేయడమే కాకుండా, ఆ మహిళలపై దాదాపు 20, 30 కోతులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు 108 కి కాల్ చేసి, ఆ మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.