దివ్యాంగుల కోసం ప్రత్యేక సమావేశాలు
NEWS Jan 09,2025 12:17 pm
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులు, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన అంశాలకు సంబంధించినవి పరిస్కరిస్తామన్నారు. సదరం క్యాంప్ లకు హాజరైన దివ్యాంగులకు సర్టిఫికెట్స్ అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.